Play all audios:
అమరావతి: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుకు నేటితో కస్టడీ ముగియనుంది. ఆయనతోపాటు ఏ2 మధుసూదన్ను కూడా
పోలీసులు ప్రశ్నించనున్నారు. విచారణ అనంతరం ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. వీరిద్దరిని తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు అధికారులు ప్రశ్నించారు. వారిని రాత్రి
సూర్యారావుపేట పోలీస్స్టేషన్లోనే ఉంచారు. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సుమారు 30కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. (Andhra Pradesh News)