Play all audios:
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని 127వ నిందితుడిగా చేర్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై వైకాపా అల్లరి
మూకలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఘటనకు కారణమైన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సీఐడీకి
బదిలీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు హత్యాయత్నంతోపాటు పలు నేరాలను కేసులో జోడించి కొందరిని అరెస్టు చేశారు. వైకాపా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్తోపాటు కృష్ణా,
గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నిందితులుగా ఉన్నారు. వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో 44 మంది
11 బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా వారందరికీ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది. వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిని 120వ నిందితుడిగా పేర్కొంటూ రెండు వారాల
క్రితమే సీఐడీ విచారించింది. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిపైనా కేసు నమోదు చేయడం కీలకంగా మారింది.