Play all audios:
విశాఖలో రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. అమరావతి: విశాఖలో రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు
నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే..యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం
ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘విశాఖలో ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం కట్టబెట్టారని జగన్ ఆరోపిస్తున్నారు. ఎకరం రూ. కోటి చొప్పున ఆ కంపెనీకి 3 ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం రూ.50లక్షల
చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్కు కొత్తేమీ కాదు. బురదజల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. సవాల్కి సిద్ధమా జగన్?’’అని లోకేశ్ పోస్టు
చేశారు.