Play all audios:
శ్రీవారిమెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లె్క్స్కు మార్చాలని తితిదే నిర్ణయించింది. తిరుమల: శ్రీవారిమెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం
టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లె్క్స్కు మార్చాలని తితిదే నిర్ణయించింది. ఈమేరకు నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులోకి
రానున్నాయి. ఈనెల 6వ తేదీ సాయంత్రం నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ.. టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది. ఆధార్కార్డు చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన
భక్తుల శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రమే దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. ఇదే సమయంలో ఎస్ఎస్డీ
(సర్వదర్శనం) టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా
పోలీసులు సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.