Play all audios:
Ola Electric- Suzlon Energy: నేడు ట్రేడింగ్ సెషన్లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సుజ్లాన్ ఎనర్జీ 12 శాతం మేర పెరిగింది. Ola Electric- Suzlon Energy | ఇంటర్నెట్
డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) షేర్లు నేడు భారీగా క్షీణించాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో 10 శాతం పతనమయ్యాయి. కంపెనీ తాజాగా
ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నష్టం రెట్టింపైందని పేర్కొనడమే ఇందుక్కారణం. దీంతో మార్కెట్ ప్రారంభంలోనే పెద్దఎత్తున నష్టపోయిన షేర్లు ప్రస్తుతం కాస్త కోలుకున్నాయి. ఉదయం 10:00 గంటల సమయంలో
ఎన్ఎస్ఈలో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 5.52 శాతం నష్టంతో 50.30 వద్ద ట్రేడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే
త్రైమాసికంలో ఈ మొత్తం రూ.416 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 62 శాతం మేర క్షీణించి రూ.611 కోట్లుగా నమోదైంది. వాహన విక్రయాలు సైతం తగ్గుముఖం పట్టాయి.
2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 1.15 లక్షల యూనిట్లను ఓలా డెలివరీ చేయగా.. గత ఏడాది కేవలం 51,375 యూనిట్లు మాత్రమే విక్రయించింది. * ఆభరణాల కొనుగోళ్లు 9-10% తగ్గొచ్చు సుజ్లాన్
ఎనర్జీ 12% జంప్ పునరుత్పాదక ఇంధన తయారీ సంస్థ సుజ్లాన్ షేర్లు నేడు ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మార్చి త్రైమాసికానికి గానూ ఫలితాల్ని కంపెనీ ప్రకటించింది. ఏకీకృత
ప్రాతిపదికన రూ.1,181 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాలానికి లాభం రూ.254 కోట్లతో పోలిస్తే ఇది అయిదింతలు అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,207.43 కోట్ల నుంచి రూ.3,825.19
కోట్లకు వృద్ధి చెందిందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో షేర్లు రాణిస్తున్నాయి. ఇంట్రాడేలో 12 శాతం మేర పెరిగి రూ.74.30 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. ఉదయం 10:00 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో సుజ్లాన్
షేర్లు 10.38 శాతం లాభంతో రూ.72.21 వద్ద ట్రేడవుతున్నాయి.