Pm modi: ఉగ్రమూకను మట్టిలో కలిపేశాం: ప్రధాని మోదీ

Pm modi: ఉగ్రమూకను మట్టిలో కలిపేశాం: ప్రధాని మోదీ

Play all audios:

Loading...

PM Modi | ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్రశిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని.. దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బిహార్‌ వచ్చినట్లు ప్రధాని మోదీ (PM


Modi) తెలిపారు. నాడు ఉగ్రవాదులను ఊహించనివిధంగా శిక్షిస్తానని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం ఆ రాష్ట్రంలోని కరకట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.  ‘‘రాముడి బాటలో


ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దానిని నెరవేర్చి తీరతాం. ఇదే సరికొత్త భారత్‌ విధానం. పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మన అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. ఒకరోజు తర్వాత నేను బిహార్‌ (ఏప్రిల్‌ 24న)


పర్యటనకు వచ్చాను. పాక్‌లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తానని ఈ గడ్డపై నుంచి దేశానికి హామీ ఇచ్చాను. నా వాగ్దానాన్ని నెరవేర్చాకే ఇప్పుడు బిహార్‌లో అడుగుపెట్టాను.  పాకిస్థాన్‌ మన


మహిళల సిందూరం శక్తిని చవిచూసింది. పాక్‌ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు. మనం ఆ దేశ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టాం. మనం వారి ఎయిర్‌ బేస్‌లను, మిలిటరీ స్థావరాలను


నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ఆపరేషన్‌ సిందూర్‌ మన అమ్ములపొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని పాక్‌ తెలుసుకోవాలి. ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు.. నెమ్మదించలేదు. మరోసారి ఉగ్రదాడి జరిగితే.. ఈసారి ఆ


పాము తలే ధ్వంసమవుతుంది’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న పట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా


‘దేశం వెనక్కి తగ్గదు.. బిహార్‌లో అభివృద్ధి ఆగదు అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.