Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్ కుమార్సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా పరిచయం కానున్నారు. ఇప్పటికే
చిత్రీకరణ పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విష్ణు (Manchu Vishnu) ప్రచారం జోరు పెంచారు. తాజాగా ఎక్స్ వేదికగా కౌంట్డౌన్ పోస్ట్ పెట్టారు.
‘‘28 రోజులు మాత్రమే మిగిలిఉంది. నేడు చెన్నైలో ‘కన్నప్ప’ గర్జిస్తాడు. ఇప్పటివరకూ చూడని కొన్ని ఫుటేజీలు అక్కడ ప్రదర్శించనున్నాం. భక్తి, యాక్షన్, మీ హృదయాన్ని కదిలించే కథతో జూన్ 27న
రానున్నాం’’ అని పోస్ట్ పెట్టారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో విష్ణు ప్రచారాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే అమెరికాలో ప్రమోషన్ చేసిన ఆయన ఇప్పుడు ఇండియాలో వరుసగా ప్రచార కార్యక్రమాలు
చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీ, డల్లాస్, లాస్ ఏంజిల్స్ సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ‘కన్నప్ప’ను ప్రచారం చేశారు. * కోహ్లీ లైక్తో అవ్నీత్కు ఫాలోవర్స్.. స్పందించిన రకుల్
ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్డ్రైవ్ను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు
చేసిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు పోస్ట్కు నెటిజన్లు దీనిపై కామెంట్స్ పెడుతున్నారు. ‘హార్డ్డ్రైవ్ దొరికిందా అన్నా ’ అని అడుగుతున్నారు. మోహన్బాబు, (Mohan Babu), శరత్కుమార్, ముకేశ్
రుషి, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్లాల్, కాజల్, అక్షయ్కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ
మూవీని తీర్చిదిద్దారు.