Play all audios:
Apple | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ (Apple) భారత్లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో
విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మూడో స్టోర్ను ప్రారంభించనుంది. దీనికోసం బెంగళూరును ఎంచుకుంది. హెబ్బాల్లోని ఫీనిక్స్ మాల్లో నూతన స్టోర్ ఏర్పాటు చేయనుంది. బెంగళూరు ఫీనిక్స్
మాల్ మొదటి అంతస్తులో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో యాపిల్ మూడో స్టోర్ను ఏర్పాటుచేయనుంది. దిల్లీలోని ఔట్లెట్ మాదిరిగానే బెంగళూరు స్టోర్ ఉండనుంది. ఈ స్థలాన్ని యాపిల్ 10 సంవత్సరాల పాటు
లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్టోర్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. భారత్లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని యాపిల్ సీఈఓ టిమ్కుక్ తాజాగా వెల్లడించారు. ఇందుకు
అనుగుణంగా దేశంలో నాలుగు రిటైల్ స్టోర్లు నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.