Play all audios:
కోల్కతా: న్యాయ విద్యార్థి శర్మిష్ఠ పనోలీను (Sharmishta Panoli) పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన భాజపా మండిపడింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata
Banerjee) తీవ్ర విమర్శలు చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించింది. ‘‘శర్మిష్ఠను అరెస్టు చేయడం సిగ్గుచేటు. రాష్ట్రానికి అవమానకరం. బెంగాల్లో ఉత్తమ పాలన కొనసాగడం
లేదు. రాజకీయ పగలు మాత్రమే కనిపిస్తున్నాయి. నిర్మమత (దయలేని) దీదీ ప్రభుత్వం చేసిన ఈ చర్య రాజ్యాంగాన్ని హత్య చేయడమే. ఈ అధికార దుర్వినియోగాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోంది. అధికార పార్టీ భావ
వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తోంది. సందేశ్ ఖాలిలో మాత్రం హైకోర్టు మందలించే వరకు నిందితుడిని అరెస్టు చేయలేదు. ముర్షిదాబాద్ హింసలో నిందితులను రక్షించేందుకు వారంతా పని చేశారు’’ అని భాజపా నేత
గౌరవ్ భాటియా ‘ఎక్స్’ వేదికగా విమర్శి్ంచారు. * అన్నావర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో జ్ఞానశేఖరన్కు జీవిత ఖైదు! పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై
బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఆమె పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత తన పోస్టులు, రీల్స్
తొలగించిన ఆమె క్షమాపణలు కోరారు. అనంతరం శర్మిష్ఠను పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా పోలీసుల చర్య భారత్లోని వాక్స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను వెంటనే
విడుదల చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.