Military training: ఆ రాష్ట్రంలో ఇకపై 1వ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ

Military training: ఆ రాష్ట్రంలో ఇకపై 1వ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ

Play all audios:

Loading...

విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్‌ మిలిటరీ శిక్షణ ఇస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌:


మహారాష్ట్రలో ఇకపై 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్‌ మిలిటరీ శిక్షణనివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం


వంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్‌ మిలిటరీ శిక్షణ ఇస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే పేర్కొన్నారు. దీనిద్వారా అత్యతసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై వారికి అవగాహన


ఉంటుందన్నారు. దీనికోసం విద్యార్థులకు మాజీ సైనికులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ


కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ పెరుగుతుందని వ్యాఖ్యానించారు.  ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ


కార్యక్రమాన్ని అమలుచేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ), స్కౌట్స్, గైడ్స్‌తో పాటు 2.5 లక్షల మంది రిటైర్డ్‌ సైనికుల సహాయం తీసుకుంటామని దాదా భూసే పేర్కొన్నారు.


ఏప్రిల్ 22న జరిగిన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు తెలిపారు. * భారత్‌ వెంటే బ్రిటన్‌ పహల్గాం (Pahalgam


Terror Attack)లోని బైసరన్‌ లోయలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం ఉగ్రవాదులను


పోషిస్తున్న పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రవాద దాడులు వంటివి సంభవించినప్పుడు ప్రజలు, అధికారులు ఎలా వారి ప్రాణాలు కాపాడుకోవాలో అవగాహన కల్పించడానికి


దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించింది.