Encounter: ‘అమ్మ’ చెప్పినా వినలేదు.. ఆర్మీ చేతిలో హతమయ్యాడు

Encounter: ‘అమ్మ’ చెప్పినా వినలేదు.. ఆర్మీ చేతిలో హతమయ్యాడు

Play all audios:

Loading...

అమ్మ చెప్పినా వినకుండా ఆర్మీపై కాల్పులు జరిపిన ఉగ్రవాది గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అంతకుముందు ఉగ్రవాది వాళ్ల అమ్మతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.


ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంతటి దుర్మార్గుడైనా అమ్మ దృష్టిలో మంచివాడే. కొడుకును సన్మార్గంలో నడిపించడానికి నిరంతరం ఆమె తాపత్రయపడుతూనే ఉంటుంది. కానీ, ఆమె మాటల్ని పెడచెవిన పెట్టిన ఓ ఉగ్రవాది సైన్యం


చేతిలో హతమయ్యాడు. గురువారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) పుల్వామా (Pulwama) జిల్లా థ్రాల్‌ ప్రాంతంలోని నాదిర్‌ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో  జేషే మహ్మద్‌ ముఠాకు చెందిన ఆమిర్‌


నజీర్‌ వని హతమైన సంగతి తెలిసిందే. అక్కడికి కొద్దిసేపటికి ముందే.. అతడు తల్లి, సోదరితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారిద్దరూ ఎంత చెప్పినా.. వినలేదు సరికదా.. ‘ఆర్మీని


ముందుకు రానివ్వండి.. వారి సంగతి చూస్తా’ అని పొగరుగా సమాధానమిచ్చాడు. వాళ్లు ఎంత ప్రాధేయపడినా పొమ్మన్నాడు. ఇదే ఘటనలో మృతి చెందిన మరో ఉగ్రవాది ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌ సోదరితోనూ నజీర్‌ మాట్లాడాడు.


తన సోదరుడి గురించి ఆమె ఆరా తీస్తే తన దగ్గరే ఉన్నాడని బదులిచ్చాడు. అక్కడికి కొద్దిసేపటి తర్వాతే ఎన్‌కౌంటర్‌ జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో కాల్‌ ఫుటేజీ వైరల్‌ అవుతోంది.  జమ్ముకశ్మీర్‌లోని


నాదిర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు కనిపెట్టిన సైన్యం వారిని చుట్టుముట్టింది. లొంగిపోవాలని హెచ్చరించింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరిపిన


భద్రతబలగాలు ఆ ముగ్గుర్నీ మట్టుబెట్టాయి. హతులను ఆసిఫ్‌ అహ్మద్ షేక్‌, ఆమిర్‌ నజీర్‌ వని, యావర్‌ అహ్మద్ భట్‌గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు


చేస్తుస్తున్నారు.కాగా.. జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్‌ ప్రాంతంలోని జిన్‌పాథర్‌ కెల్లర్‌లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను


భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు.