Operation sindoor: అమెరికాకు థరూర్‌ బృందం.. యూకేకు రవిశంకర్‌ బృందం

Operation sindoor: అమెరికాకు థరూర్‌ బృందం.. యూకేకు రవిశంకర్‌ బృందం

Play all audios:

Loading...

దిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. శశిథరూర్‌


(కాంగ్రెస్‌), రవిశంకర్‌ ప్రసాద్‌ (భాజపా), బైజయంత్‌ పాండా (భాజపా), సంజయ్‌కుమార్‌ ఝా (జేడీ-యూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలె (ఎన్సీపీ-ఎస్పీ), శ్రీకాంత్‌ శిందే (శివసేన)లు ఈ బృందాలకు నేతృత్వం


వహిస్తారు. దేశం తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ యవనికపై చాటడం ఉద్దేశంగా ఐరాస భద్రతా మండలిలోని దేశాలకూ ఈ బృందాలు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.  ఏయే


బృందాలు.. ఏయే దేశాలకు వెళ్తాయనే జాబితాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తాజాగా వెల్లడించారు. * బైజయంత్‌ పాండా నేతృత్వంలోని బృందం: సౌదీఅరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌,


అల్జీరియా * రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం: యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌ * సంజయ్‌కుమార్‌ ఝా బృందం: ఇండోనేసియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, జపాన్‌, సింగపూర్‌ * శ్రీకాంత్‌ శిందే


బృందం: యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, సియెర్రా లియోన్‌ * శశిథరూర్‌ బృందం: యూఎస్‌, పనామా, గయానా, బ్రెజిల్‌, కొలంబియా * కనిమొళి బృందం: స్పెయిన్‌, గ్రీస్‌, స్లోవేనియా,


లాట్వియా, రష్యా * సుప్రియా సూలె బృందం: ఈజిప్ట్‌, ఖతార్‌, ఇథియోపియా, దక్షిణాఫ్రికా