Gt vs mi: చెలరేగిన రోహిత్‌.. Gt టార్గెట్‌ 229

Gt vs mi: చెలరేగిన రోహిత్‌.. Gt టార్గెట్‌ 229

Play all audios:

Loading...

ఛండీగఢ్‌: ఐపీఎల్ (IPL) 2025 ప్లే ఆఫ్స్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20


ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచికొట్టాడు. జానీ బెయిర్‌స్టో (47; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో అర్ధ శతకం


మిస్ చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (33; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (25; 11 బంతుల్లో 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (22*; 9 బంతుల్లో 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు


మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. రోహిత్ 300 సిక్స్‌లు ఈ మ్యాచ్‌లో రోహిత్ నాలుగు సిక్స్‌లు కొట్టిన రోహిత్ ఐపీఎల్‌లో 300


సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 300 సిక్స్‌లు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 301


సిక్స్‌లున్నాయి. ఆరంభంలో రెండు లైఫ్‌లు అందుకున్న రోహిత్.. తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతను 28 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.