Rcb vs kkr: కోల్‌కతా ఆశలపై నీళ్లు.. బెంగళూరుతో మ్యాచ్‌ వర్షార్పణం

Rcb vs kkr: కోల్‌కతా ఆశలపై నీళ్లు.. బెంగళూరుతో మ్యాచ్‌ వర్షార్పణం

Play all audios:

Loading...

బెంగళూరు: తొమ్మిది రోజుల తర్వాత ఐపీఎల్ (IPL) 2025 పునఃప్రారంభం కావడంతో మళ్లీ ధనాధన్ వినోదాన్ని ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ


(Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మ్యాచ్‌కు


వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ముందే అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. తొలుత చిన్నపాటి జల్లుగా మొదలై క్రమంగా జోరందుకుంది. తర్వాత వరుణుడు కొద్దిసేపు


శాంతించడంతో మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, కాసేపటికే మళ్లీ వాన మొదలైంది. వర్షం తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని చూశారు.


కానీ, ఎడతెరిపి లేకుండా వాన కురువడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.  కోల్‌కతా ఔట్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనుకున్న కోల్‌కతా (Kolkata


Knight Riders) ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌ రద్దవడంతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది.


చివరి లీగ్ మ్యాచ్‌లో (హైదరాబాద్‌తో) గెలిచినా కోల్‌కతాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక, కేకేఆర్‌పై గెలిచి అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుందామనుకున్న ఆర్సీబీకి నిరాశే ఎదురైంది.


అయితే, 12 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లతో ఉన్న బెంగళూరు.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.