Play all audios:
పంజాబ్తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానులకు ఒక సందేశం ఇచ్చాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 (IPL) టైటిల్ను
దక్కించుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఒక్క అడుగు దూరంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్లో పంజాబ్ను (Punjab Kings) చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్కు
దూసుకెళ్లింది. పంజాబ్పై భారీ విజయం సాధించి ఊపు మీదున్న బెంగళూరు మరో విజయం సాధించి టైటిల్ కరవును తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్
పాటీదార్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ అభిమానులకు ఒక సందేశం ఇచ్చాడు. ఎక్కడ మ్యాచ్లు ఆడిన జట్టుపై అభిమానుల ఆదరణ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. టైటిల్ గెలుస్తామనే ధీమా వ్యక్తం
చేస్తూ.. ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చాడు. ‘పంజాబ్తో మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఫాస్ట్ బౌలర్లు పిచ్ను బాగా
ఉపయోగించుకున్నారు. సుయాశ్ బౌలింగ్ అద్భుతం. లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేశాడు. కెప్టెన్గా అతడు బౌలింగ్ ఎలా చేస్తాడో నాకు అవగాహన ఉంది. వికెట్లను లక్ష్యంగా చేసుకోని బంతులను సంధిస్తాడు.
అదే అతని బలం. సుయాశ్ బౌలింగ్ను బ్యాటర్లు అర్థం చేసుకోవడం కష్టం. ఎప్పటికప్పుడు అతడికి సూచనలు ఇస్తుంటా. అతడిని కంగారు పెట్టడం ఇష్టం లేదు. కొన్నిసార్లు పరుగులు ఇచ్చినా మద్దతు ఇస్తూనే ఉంటా.
టోర్నీ ఆసాంతం చాలా ప్రాక్టీస్ చేశాం. ప్రతి మ్యాచ్లో ఫిల్ సాల్ట్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం గొప్పగా ఉంటుంది. శుభారంభం అందిస్తున్న తీరు గురించి ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు. నేను ఫిల్ సాల్ట్కు పెద్ద అభిమానిని. ఆర్సీబీ అభిమానులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. మేము ఎక్కడ మ్యాచ్లు ఆడినా దాన్ని మా హోమ్ గ్రౌండ్ లానే భావిస్తాము.
ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. కలిసి సంబరాలు చేసుకుందాం’ అని రజత్ పేర్కొన్నాడు.