Hyderabad: గుల్జార్‌హౌస్‌ సమీపంలో అగ్నిప్రమాదం.. ముగిసిన క్లూస్‌ టీమ్‌ విచారణ

Hyderabad: గుల్జార్‌హౌస్‌ సమీపంలో అగ్నిప్రమాదం.. ముగిసిన క్లూస్‌ టీమ్‌ విచారణ

Play all audios:

Loading...

చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్‌ టీమ్‌ అధికారుల విచారణ పూర్తయింది. హైదరాబాద్‌: చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద


ఘటనపై క్లూస్‌ టీమ్‌ అధికారుల విచారణ పూర్తయింది. ఇంటి లోపలికి వెళ్లి క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. గోడలు బీటలు వారినట్లు అధికారులు గుర్తించారు. భవనం కూలిపోయే అవకాశం ఉన్నట్లు


అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 14 ఏసీలు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  దీనిపై ప్రస్తుతం దర్యాప్తు


కొనసాగుతోంది.  మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. 17 మంది మృతిపై జూన్‌


30లోగా నివేదిక సమర్పించాలని సీఎస్‌తోపాటు హైదరాబాద్‌ సీపీ, అగ్నిమాపక డీజీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ చీఫ్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది.