Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్ గగనతలం మూసివేత

Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్ గగనతలం మూసివేత

Play all audios:

Loading...

మే 23-24 తేదీల్లో భారత్‌ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అండమాన్‌ నికోబార్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు నోటమ్‌ జారీ చేశారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: అండమాన్‌


నికోబార్‌ గగనతలం (Andaman airspace) మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఎయిర్‌లైన్స్‌కు నోటమ్‌ జారీ చేశారు. మే 23-24 తేదీల్లో ఈ ప్రాతంలో భారత్‌ క్షిపణి పరీక్షలు (High altitude weapon Tests)


నిర్వహించనున్నట్లు ప్రకటించిన రెండు రోజుల పాటు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం


ఉన్నందున అండమాన్‌ నికోబార్‌ గగనతలంలో ఎటువంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతించబోమని తెలిపారు. గతంలోను ఇటువంటి పరీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  * ఎస్‌-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు


డోభాల్‌..! పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో పెద్ద


మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత్‌.. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఇందులోభాగంగా పలు క్షిపణి పరీక్షలను సైతం నిర్వహిస్తుండడం గమనార్హం.