Play all audios:
పాకిస్థాన్ (Pakistan) మరోసారి ఉగ్రదాడులకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan)
మరోసారి ఉగ్రదాడులను ప్రోత్సహిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) హెచ్చరించారు. దాయాది దేశం ఇలానే ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదొస్తే కఠిన చర్యలు
తప్పవన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని రెండు
ప్రాంతాల్లో నిర్వహించిన ‘తిరంగా యాత్ర’కు భాజపా నేత అనురాగ్ ఠాకూర్ హాజరై మాట్లాడారు. ‘‘పాక్ మరోసారి దారుణాలకు ఒడిగడితే భారత్ తీసుకునే ప్రతిచర్యలు మరింత కఠినంగా ఉంటాయి. మన జోలికి వచ్చిన ఏ
ఒక్కరినీ వదిలిపెట్టం. దీనికోసం ఎంత ఖర్చయినా వెనకాడం. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలకు సెల్యూట్. మన సైన్యం ఉగ్రవాదులను అంతం చేసి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా
చాటింది. పౌరులకు హాని కలగకుండా ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం మన సైనిక బలగాల గొప్పతనం’’ అని అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. * మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై.. సీబీఐ ఛార్జిషీటు దాఖలు ఇదిలా
ఉంటే.. పాకిస్థానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు హిమాచల్ ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ తెలిపారు.
లేని పక్షంలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇప్పటివరకు చొరబాటుదారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని బిందాల్ తీవ్రంగా తప్పుబట్టారు.