Fish prasadam: జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లపై డీసీపీ సమీక్ష

Fish prasadam: జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లపై డీసీపీ సమీక్ష

Play all audios:

Loading...

జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిన సోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌: జూన్‌ 8 ,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది.


నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిన సోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పంపిణీ ఏర్పాట్లపై 21 శాఖల అధికారులతో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి సమీక్ష నిర్వహించారు.


నిర్వాహకులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ, ఎన్జీవోలు ఇతర శాఖల అధికారులతో చర్చించారు. గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా అందరూ సమన్వయంతో


పనిచేయాలని ఆదేశించారు.