Play all audios:
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్
బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు
అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్
అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. (Telangana News)