Play all audios:
ఇంటర్నెట్డెస్క్: పాక్ (Pakistan)లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న లష్కరే తయ్యిబా ఉగ్రవాదులతో కలిసి ఒకే వేదికపై
కూర్చుకున్నారు. వారిలో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకు ఉన్నాడు. ఈ వ్యవహారశైలి అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీస్తోన్న తరుణంలో.. తమది బాధిత దేశమంటూ పాక్ ప్రచారం చేసుకుంటోంది. పాకిస్థాన్
క్రిప్టో కౌన్సిల్ సీఈవో బిలాల్ బిన్ సాహిబ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని లాస్వెగాస్లో జరిగిన గ్లోబల్ క్రిప్టో కరెన్సీ కౌన్సిల్ సమావేశంలో బిలాల్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్,
బిట్కాయిన్.. రెండూ నిర్వహణ సరిగాలేని ప్రజా సంబంధాల బాధితులు (victims of bad PR). అందువల్లే తమను చెడుగా, ప్రమాదకరంగా, స్థిరత్వం లేనట్లుగా చూస్తున్నారు. కానీ వీటికి ఆవల.. మన సామర్థ్యం,
వనరులు, ప్రతిభను చూడొచ్చు’’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల భారత్తో ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ.. పాక్ను ఎప్పుడూ ఘర్షణ కోణం నుంచే చూస్తున్నారని, మన దేశ సేవల్ని గుర్తించడం లేదని
వాపోయారు. ఇప్పుడు పాక్ను క్రిప్టో కోణం నుంచి తాను పరిచయం చేస్తున్నానన్నారు. * పాక్ అణు పరీక్ష ర్యాలీలో ఉగ్రవాదులు మార్చి నెలలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. బిలాల్ను పాక్ క్రిప్టో
కౌన్సిల్ సీఈవోగా నియమించారు. పాకిస్థాన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి ఆయన ఇటీవల ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్తో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు యూఎస్ క్రిప్టో కరెన్సీ సంస్థ
‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’తో పాక్ క్రిప్టో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్లో మెజార్టీ వాటా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబానిది కావడం గమనార్హం. ఆ ఒప్పందంలో
మునీర్ పాత్రను కూడా అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. దీనికోసం ట్రంప్ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఇస్లామాబాద్- వాషింగ్టన్ మధ్య రాకపోకలు సాగించారు. ఇక ఈ ఒప్పందం ఖరారయ్యే సమయంలో ట్రంప్
చిరకాల సన్నిహితుడు స్టీవ్ విట్కాఫ్ తనయుడు జాఖరీ విట్కాఫ్ అక్కడే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం తాను విజయవంతంగా
మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్తో భారత్-పాక్ మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదిలాఉంటే..
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి అల్లాడిపోతున్న పాకిస్థాన్కు పహల్గాం ఉగ్రదాడి తర్వాత 1 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) ఆమోదం తెలిపిన విషయం
తెలిసిందే. పాక్కు నిధులు మంజూరుచేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకొని ఐఎంఎఫ్ పాక్కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని మోదీ ప్రభుత్వం
కోరినప్పటికీ ఆ ఆమోదం లభించింది. ఐఎంఎఫ్లో పెద్దన్న పాత్ర అమెరికాదని అందరికీ తెలిసిందే..!