Play all audios:
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వివరాలు ఈ పబ్లిక్ ఆఫరింగ్లో నెట్ ఆఫర్, ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్, పాలసీదారుల రిజర్వేషన్ పోర్షన్ కూడిన 31.62 కోట్ల వరకు ఈక్విటీ షేర్లు ఉంటాయి. మొత్తం మూలధనమైన 632.49
కోట్ల షేర్లలో ఐదు శాతం వరకు IPOకు వస్తాయి. మిగిలిన 95 శాతాన్ని ప్రభుత్వం తనవద్దే ఉంచుకుంటుంది. ఈ ఆఫర్ ద్వారా వచ్చే ఆదాయంలో ఏ భాగాన్ని కార్పొరేషన్ తన డైరెక్టర్లకు లేదా ముఖ్య నిర్వాహక
సిబ్బందికి చెల్లించదని LIC చెప్పింది. ఈ పబ్లిక్ ఆఫర్.. ఆఫర్ ఫర్ సేల్ కాబట్టి దీని నుంచి సంస్థ ఎలాంటి ఆదాయాన్ని పొందదు. అందువల్ల ఆఫర్ కోసం మానిటరింగ్ ఏజెన్సీని నియమించాల్సిన అవసరం లేదు.
మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి LIC ఎర్నింగ్ పర్ షేర్ (EPS) విలువను 4.70, నికర విలువపై రిటర్న్ రూ. 45.65 శాతంగా లెక్కించింది. సెప్టెంబర్ 30, 2021 నాటికి ఒక్కో షేరుకు నికర ఆస్తి
విలువ రూ.12.68గా ఉంది. ఈ ఆఫర్ను సెబీ కొన్ని రోజుల్లో క్లియర్ చేస్తుందని.. IPO ప్రాసెస్, లిస్టింగ్ మార్చి 2022 నాటికి ముగుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. advertisement ప్రభుత్వానికి
ఎల్ఐసీకి ఆఫర్తో ప్రయోజనం ఏంటి? ఆఫర్ ఖర్చులు, సంబంధిత పన్నులను తీసివేసిన తర్వాత.. ఆఫర్ మొత్తం ఆదాయం ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తుంది. ఈ ఆఫర్ నుంచి LIC ఎటువంటి ఆదాయాన్ని పొందదు. ఆఫర్ ధరను బట్టి
ప్రభుత్వం IPO నుంచి రూ. 50,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు సమీకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఊతమివ్వడంతోపాటు ద్రవ్య లోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.
అయితే ఆదాయం లభించకపోయినా ఈ లిస్టింగ్ ద్వారా LIC ప్రొఫైల్ మెరుగవుతుంది. పెట్టుబడిదారులు స్టాక్ ఎక్స్ఛేంజీలలో LIC షేర్లతో వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వానికి మాత్రమే
జవాబుదారీగా ఉన్న LICలో మరింత పారదర్శకత వస్తుంది. లిస్టింగ్ తర్వాత ధరలకు సంబంధించిన సున్నితమైన సమాచారం గురించి పెట్టుబడిదారులకు, ఎక్స్ఛేంజ్లకు సంస్థ వివరాలను తెలియజేయాలి. అంటే LIC
పెట్టుబడిదారులకు జవాబుదారీగా ఉంటుంది. వారి అంచనాలను అందుకుంటుంది. పెట్టుబడిదారులు కార్పొరేషన్ నుంచి ఉన్నత స్థాయి కార్పొరేట్ గవర్నెన్స్ డిమాండ్ చేయడం వల్ల అన్ని కార్యకలాపాలు పారదర్శకంగా
జరుగుతాయి. advertisement ఐపీఓ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? రిజర్వేషన్, డిస్కౌంట్ ఉంటుందా? ఆఫర్లో 5 శాతాన్ని ఉద్యోగుల కోసం రిజర్వ్ చేస్తారు. 10 శాతానికి మించని మరో భాగాన్ని అర్హులైన
పాలసీదారులకు రిజర్వ్ చేస్తారు. పాలసీదారులు, ఉద్యోగులు రాయితీపై షేర్లను పొందే అవకాశం ఉంది. ఈ డిస్కౌంట్ వివరాలను కార్పొరేషన్ వెల్లడించనప్పటికీ, మార్కెట్ అంచనా ప్రకారం ఆఫర్ ప్రైజ్లో ఐదు శాతం
డిస్కౌంట్ ఉండవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం LIC కనీసం 35 శాతం ఇష్యూను రిజర్వ్ చేస్తుంది. పాలసీదారులు పాన్ను పాలసీతో లింక్ చేసి, షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్
చేయాలని ఎల్ఐసీ కోరింది. సంస్థ 60 శాతం వరకు QIB (qualified institutional buyers) పోర్షన్ను విచక్షణ ఆధారంగా పెట్టుబడిదారులకు కేటాయించవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్లో మూడింట ఒక వంతును
దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కోసం రిజర్వ్ చేస్తారు. advertisement పబ్లిక్ ఇష్యూతో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సవరించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమైన రూ.78,000
కోట్లను చేరుకోవడంలో IPO కీలకంగా ఉంది. అయితే మార్కెట్ ఎపటైట్తో పాటు ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను
పెంచాలని చూస్తున్నందున, సమీప భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. US, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి,
ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ల నుంచి FPIలు డబ్బును ఉపసంహరించుకుంటాయి. ఈ నిధులను US ట్రెజరీ బాండ్లలోకి తరలిస్తాయి. ఇది సెకండరీ మార్కెట్పై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ప్రైమరీ మార్కెట్ ఇష్యూలలో
పెట్టుబడులకు లిక్విడిటీ లభ్యతను తగ్గిస్తుంది. advertisement ఎల్ఐసీ ఇష్యూ పరిమాణం రూ. 50,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి, లిక్విడిటీ ఇక్కడ ప్రధాన అంశంగా ఉండనుంది. ఇటీవలి కాలంలో
ఈక్విటీ మార్కెట్లలో క్షీణత కారణంగా, ఇష్యూ కోసం ప్రభుత్వం అధిక ప్రీమియంను నిర్దేశించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం తక్కువ ధరకు షేర్స్ కేటాయించాల్సి
ఉంటుంది. పెట్టుబడిదారులు ఇష్యూ ధరలను జాగ్రత్తగా పరిశీలించి, వాల్యుయేషన్పై తగిన శ్రద్ధ వహించాలి. Location : First Published : February 14, 2022 6:11 PM IST