Very sad: పరీక్ష రాసి వస్తుండగా ఘోరం.. కూతురు మృతి.. ఒంటరైన తల్లి..!

Very sad: పరీక్ష రాసి వస్తుండగా ఘోరం.. కూతురు మృతి.. ఒంటరైన తల్లి..!

Play all audios:

Loading...

Published by: Last Updated:April 11, 2023 1:29 PM IST విధి ఆడిన వింత నాటకంలో ఓ తల్లి ఒంట‌రైంది. పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ జీవితాంతం తోడుంటాడనుకుంటే అనారోగ్యంతో 13 యేళ్ల క్రితం మృతి చెందాడు.


అయితే రెండేళ్ల పాపలో త‌న జీవితాన్ని చూసుకుంది. P.MAHENDER, NEWS18, NIZAMABAD విధి ఆడిన వింత నాటకంలో ఓ తల్లి ఒంట‌రైంది. పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ జీవితాంతం తోడుంటాడనుకుంటే అనారోగ్యంతో 13 యేళ్ల


క్రితం మృతి చెందాడు. అయితే రెండేళ్ల పాపలో త‌న జీవితాన్ని చూసుకుంది. అత్తగారి ఊరిలో ఉండేందుకు ఇళ్లు, భూమి జాగా లేక పోవ‌డంతో రెండేళ్ల పాపతో కలిసి పుట్టింటికి వ‌చ్చింది. కూలీ పనులు చేసుకుంటూ


కూతురును చదివిస్తోంది. అయితే అమ్మాయి పదో తర గతి పరీక్ష రాసి అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇంటికి వ‌స్తున్న స‌మ‌యంలో రోడ్డు ప్రమాదం రూపంలో మళ్లీ విధి కాటేసింది. దీంతో పదో తరగతి విద్యార్థిని దుర్మరణం


పొందిన‌ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. advertisement కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన సాయ‌మ్మకి


16 యేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి పాప శిరీష పుట్టిన రెండేళ్ల‌కు భ‌ర్త ఆనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రెండేళ్ల పాపతో క‌లిసి పుట్టింటికి వ‌చ్చింది. కూలీ ప‌ని చేసుకుంటూ శిరీష‌ను పెంచి


పెద్ద చేసింది. ఇప్పుడు శిరిష ప‌ద‌వ త‌ర‌ల‌గ‌తి ప‌రిక్ష‌లు రాస్తుంది. సోమవారం పరీక్ష రాసి ఆటోలో ఇంటికెళ్తున్న సమయంలో బిచ్కుంద బారడీ పోచమ్మ మందిరం సమీపంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఎదురుగా


వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా కొట్టింది. దీంతో శిరీస‌కు తీవ్ర గాయ‌లయ్యాయి. శిరీష‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. advertisement అయితే అదేఆటోలో ఉన్న


తల్లి సాయమ్మ, అమ్మమ్మ ఈరవ్వతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే త‌న క‌ళ్ల ముందే క‌న్న కూతురు మృతి చెందడాన్ని చూసిన త‌ల్లి క‌న్నీటి ప‌ర్యతం అయ్యారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు


అలుముకున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. వివాహం జ‌రిగిన మూడేళ్ల‌కే భ‌ర్త‌ను పోగోట్టుకున్న భార్య‌.. రెండేళ్ల బిడ్డ‌తో త‌న జీవితాన్ని సాగించాల‌నుకుంది. కానీ ఆ


భ‌గ‌వంతుడు త‌నను చిన్న చూపు చూడ‌డంతో ఇప్పుడు క‌న్న కూతురు కూడా త‌న‌కు దూర‌మ‌వ్వ‌డంతో ఆ తల్లి వేద‌న వ‌ర్ణ‌నాతీతంగా ఉంది. ఆ త‌ల్లి ఒంటరై బ్ర‌తికి ఉన్న జీవ‌చ్ఛ‌వంగా మారింది. Location :


Kamareddy,Nizamabad,Telangana First Published : April 11, 2023 1:29 PM IST Read More