Play all audios:
వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీకేపల్లి: వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రకాశ్రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పాపిరెడ్డిపల్లెలో జరిగిన హెలికాప్టర్ ఘటన
కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్ దిగకముందే వైకాపా కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమంది ఆ పార్టీ
కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. జగన్ భద్రతపై పోలీసులు చేసిన సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పాటించలేదు. హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి
రెచ్చగొట్టినట్లు.. భద్రతా వైఫల్యంగా చూపేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. (Andhra Pradesh News)