Play all audios:
హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా గొలుసు దొంగలు రెచ్చిపోయారు. విజయపురి కాలనీలోని వర్ష బ్యాంగిల్ స్టోర్కు ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వచ్చారు. కొనుగోలు చేస్తున్నట్టు
నటించి.. దుకాణం యజమానురాలు సంధ్యను మాటల్లో పెట్టారు. ఆమె ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన
పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.