Play all audios:
ముంబయి: మహారాష్ట్రలోని మల్వానీ ప్రాంతంలో సభ్యసమాజం తల దించుకునే ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి పేగుబంధం మరిచి ప్రవర్తించింది. రెండున్నరేళ్ల తన కుమార్తెపై
ప్రియుడు అత్యాచారం చేస్తుంటే అతడికి సహకరించి అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్వానీ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ మూడేళ్ల క్రితం గర్భిణిగా ఉన్న సమయంలో
భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. అనంతరం ఆమెకు 19ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఆదివారం రాత్రి మహిళ తన రెండున్నరేళ్ల కుమార్తెతో ఉన్న
సమయంలో వారి ఇంటికి వచ్చిన యువకుడు చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని ఆపాల్సింది పోయి.. ప్రియుడు తన కుమార్తెపై హత్యాచారం చేస్తుంటే మహిళ అతడికి సహకరించింది. దీంతో కొద్దిసేపటికి
బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి మూర్ఛపోయి పడిపోయిందని పేర్కొంటూ.. తమపై ఎవరికీ అనుమానం రాకుండా మాల్వాణి జనకళ్యాణ్ నగర్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి మూర్ఛవ్యాధి
ఉందని.. హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయిందని వైద్యులను నమ్మించింది. అయితే అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు నిర్థరించారు. మృతదేహానికి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో బాలిక ప్రైవేటు భాగాలపై
గాయాలను గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. తన కుమార్తెపై హత్యాచారం చేయడానికి అతడికి మహిళ సహకరించిందని.. బాలిక పరిస్థితి చేయి దాటిపోయినట్లు గమనించి వారు మూర్ఛ నాటకం ఆడారని
పోలీసులు పేర్కొన్నారు. మహిళ, యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.