Play all audios:
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో నలుగురు పిల్లలు చనిపోగా.. దాదాపు 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్థాన్లోని కుజ్దార్ ప్రావిన్స్లో ఈ
దారుణం చోటుచేసుకొంది. ‘‘ఆర్మీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది’’ అని స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి
అనే సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ దాడిలో ఓ కారును ఆత్మాహుతి కోసం వాడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మొహసీన్ నఖ్వీ ఈ దాడిని ఖండించారు. పిల్లలపై దాడి చేసినవారు
రాక్షసులని అభివర్ణించారు. ఇప్పటివరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ, బలోచిస్థాన్లోని వేర్పాటువాద గ్రూపులు దీని వెనక ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే
బలోచిస్థాన్లోని ఖిల్లా అబ్ధుల్లా అనే ప్రాంతంలో కారుబాంబు పేలడంతో నలుగురు చనిపోయారు. ఈ ప్రదేశం అఫ్గాన్ సరిహద్దుల్లో ఉంటుంది.