Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: మే ప్రారంభంలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై
ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు పోస్ట్లు పెట్టగా.. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) దీనిపై ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. ఈ పోస్ట్కు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
దర్శకుడు అభిషాన్ జీవింత్ స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకూ ఎంతో ఆసక్తిగా ఉంది.
అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు. ఇటీవల కాలంలో చూసి బెస్ట్ సినిమా ఇది. మీరంతా కూడా కచ్చితంగా చూడండి’’ అని పోస్ట్ పెట్టారు. దీనికి అభిషాన్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన సినిమాలను ఎంతో ఆశ్చర్యంగా చూసేవాడిని. అలాంటిది ఆయన నా సినిమాను ప్రశంసించారు. నా పేరు పలికారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అని పోస్ట్
పెట్టారు. * రోజూ రాత్రి భర్త పెట్టే గురకతో యుద్ధం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మే 1న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ విజయవంతంగా థియేటర్స్లో రన్ అవుతోంది. ఇటీవలే ఈ
సినిమాను రజనీకాంత్ ప్రశంసించారు. అలాగే శివకార్తికేయన్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దీన్ని జపాన్లోనూ విడుదల చేయనున్నారు. మే 24న జపాన్లో ఈ
చిత్రం విడుదల కానున్నట్లు టీమ్ తెలిపింది.