Play all audios:
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోధ్పుర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల
అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతకం ప్రకారం తనకు ఇద్దరు భార్యలు అని, తనను పెళ్లి చేసుకోవాలంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినిని తరచూ వేధింపులకు గురిచేశాడు. దీంతో
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్లోని జోధ్పుర్ జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన. * ‘పాక్లో నన్ను పెళ్లి
చేసుకో’.. జ్యోతి మల్హోత్రా చాటింగ్ లీక్! వివరాల్లోకి వెళ్తే.. బోరనాడ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఇంగ్లిష్ బోధిస్తున్న దల్పత్ గార్గ్ అనే ఉపాధ్యాయుడు తన కుమార్తెను పెళ్లి
చేసుకుంటానని వేధిస్తున్నట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 7న స్కూల్లోని భోజన విరామ సమయంలో ‘నువ్వంటే నాకు ఇష్టం. నా జాతక ప్రకారం నాకు ఇద్దరు భార్యలు’ అని తన కుమార్తెతో అతడు
అన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తన కుమార్తెను అనుసరిస్తూ ఇంటి వరకు వచ్చేసి.. అసభ్యకరంగా సైగలు కూడా చేశాడని ఆరోపించారు. జనవరి 11వ తేదీన ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయగా.. సంబంధిత సీసీటీవీ
ఫుటేజీతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక పంపగా.. సదరు టీచర్ను సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేస్తున్నవారిపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒకసారి తమను లూని పంచాయతీ సమితి చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్కు తీసుకెళ్లి అక్కడ అందరూ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. ఒకవేళ అలా చేయకపోతే.. తన కుమార్తె టీసీని
ఇవ్వబోమని, ఎక్కడా అడ్మిషన్ దొరకదంటూ బెదిరించారని పేర్కొన్నారు. దీంతో బాలికను వేధించిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, బుధవారం మెజిస్ట్రేట్ ముందు బాలిక
వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసిన అందరిపైనా కేసులు నమోదు చేశారు.