Thug life movie: 70ఏళ్ల కమల్‌తో 42ఏళ్ల త్రిష రొమాన్స్‌.. ట్రోలర్స్‌కు మణిరత్నం పర్‌ఫెక్ట్‌ ఆన్సర్‌

Thug life movie: 70ఏళ్ల కమల్‌తో 42ఏళ్ల త్రిష రొమాన్స్‌.. ట్రోలర్స్‌కు మణిరత్నం పర్‌ఫెక్ట్‌ ఆన్సర్‌

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలో మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా ‘థగ్‌లైఫ్‌’ (Thug Life). అన్ని కార్యక్రమాలు పూర్తి


చేసుకున్న ఈ మూవీ జూన్‌ 5న (Thug Life Release Date) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే, ట్రైలర్‌లో త్రిష, అభిరామిలతో


కమల్‌హాసన్‌ రొమాన్స్‌ చేసే సన్నివేశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్‌ మొదలయ్యాయి. 70 ఏళ్ల కమల్‌, 42ఏళ్ల త్రిషతో రొమాన్స్‌ ఏంటి? అంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. తనకంటే వయసులో


28ఏళ్ల చిన్నదైన అభిరామితో లిప్‌లాక్‌ పైనా కొందరు ట్రోల్స్‌ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆ విమర్శలకు దర్శకుడు మణిరత్నం కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ‘‘నిజ జీవితంలోనూ అలాంటి


వ్యక్తులు ఉంటారు. పురుషులు, మహిళలు ఎవరైనా తమకంటే చిన్నవారితో లేదా పెద్దవారితో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అది జీవిత సత్యం. ఇలాంటి బంధాలు ఇప్పుడు పుట్టినవి కావు. ఎంతో కాలం నుంచి ఉన్నాయి. సినిమాల


విషయానికొస్తే, ఏదైనా విషయంపై తప్పు ఎత్తి చూపటం లేదా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. అదే సమయంలో మీరు దాన్ని సమర్థించవచ్చు. లేకపోతే, సమాజంలో కళ్ల ముందు జరిగే వాటికి ఎలాగైతే మౌనంగా ఉంటున్నారో


అలాగే, కళ్లు మూసుకుని కూడా ఉండవచ్చు. ఒక సన్నివేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని చూస్తున్నప్పుడు వాళ్లు కమల్‌హాసన్‌, త్రిషలా చూడకూడదు. అవి వాళ్లు పోషించిన పాత్రలు. సినిమాలో ఉన్నది అదే. మీరు


సినిమా చూసిన తర్వాత వాళ్ల బంధం ఏంటి? ఎలా ఏర్పడింది?అది వాస్తవమా? కాదా? తెలుసుకుని అప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. అంతేకానీ,  కమల్‌హాసన్‌, త్రిషను దృష్టిలో పెట్టుకుని


చెప్పొద్దు’’ అని మణిరత్నం అన్నారు. ‘నాయకన్‌’ (1987) లాంటి హిట్‌ తర్వాత కమల్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. గ్యాంగ్‌స్టర్‌, యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. త్రిష,


శింబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్‌ సెల్వన్‌, జోజు జార్జ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.