Play all audios:
దిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాక్కు చెందిన ఉగ్ర, అణు
స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించింది. ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది.. ఏవిధంగా దాడులు చేసింది పేర్కొంటూ భారత సైన్యం
ఇప్పటికే పలు వీడియోలు షేర్ చేసింది. తాజాగా ఆపరేషన్ సిందూర్లో వినియోగించిన ఏడీ గన్పై రూపొందించిన మరో ప్రత్యేక వీడియోను వెస్ట్రన్ కమాండ్ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నేను
ఏడీ(ఎయిర్ డిఫెన్స్) గన్.. శత్రువు కనిపిస్తే లేపేస్తా’ అంటూ అది అత్యంత కచ్చితత్వంతో వైమానిక దాడులు ఎలా నిర్వహించిందో తెలిపేలా దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. వైమానిక దాడుల దృశ్యాలు,
కూలిపోయిన పాకిస్థానీ డ్రోన్లను ఆర్మీ సిబ్బంది సేకరించడం, దాడి సమయంలో సైన్యం అప్రమత్తత మొదలైన విషయాలను వివరిస్తూ వీడియోను రూపొందించారు. దేశం ప్రశాంతంగా నిద్రపోవడానికి తాము మేల్కొని.. నిరంతరం
అప్రమత్తంగా ఉన్నామని.. భూమి నుంచి ఆకాశాన్ని రక్షించామని జాతీయ భద్రతపై తమ నిబద్ధతను సైన్యం పునరుద్ఘాటించింది. శత్రువులను బూడిద చేసే వరకు తాము విశ్రమించమని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో
వైరల్గా మారడంతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తీరును.. సైనికుల త్యాగాలను నెటిజన్లు కొనియాడుతున్నారు. * లష్కరే కీలక నేత సైఫుల్లా హతం పహల్గాం ఉగ్రదాడి అనంతరం మే 7న ‘ఆపరేషన్
సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ
దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు
భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.