Play all audios:
నేటితో(ఆదివారం) భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణ
ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. నేటితో(ఆదివారం) భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. కాల్పుల విరమణ అవగాహనకు
ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే కొనసాగుతోందని స్పష్టం చేశాయి. ఆరోజు జరిగిన డీజీఎంవో చర్చల్లో నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొన్నాయి.
10వ తేదీ డీజీఎంవో చర్చల్లో నిర్ణయానికి కాలపరిమితి లేదని వివరించాయి. ఆదివారం ఎలాంటి డీజీఎంవో స్థాయి చర్చలు లేవని తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార
దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఎదురు దాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan) కోరడంతో
అందుకు భారత్ అంగీకరించగా.. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. వీటికి సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ
అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.