Jaishankar: పాక్‌ సైనిక పాలనకు మద్దతు.. ఐరోపాపై జైశంకర్ తీవ్ర విమర్శలు

Jaishankar: పాక్‌ సైనిక పాలనకు మద్దతు.. ఐరోపాపై జైశంకర్ తీవ్ర విమర్శలు

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ వక్రబుద్ధిని కేంద్రమంత్రి ఎస్‌.జైశంకర్ (Jaishankar) విదేశాల్లో ఎండగడుతున్నారు. తాజాగా ఆయన జర్మనీ మీడియాతో మాట్లాడుతూ ఐరోపా


దేశాల వైఖరిని ఆక్షేపించారు. సైనిక పాలనకు, సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న పాక్‌కు మద్దతు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. ‘‘1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌లో మా


సరిహద్దుల వెంట పాక్‌ రెచ్చగట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగిన ఐరోపా దేశాలు.. పాక్‌ సైనిక పాలనకు మద్దతుగా నిలిచాయి. పశ్చిమ దేశాల నుంచి


వచ్చిన మద్దతు ఇంకెవరి నుంచి రాలేదు’’ అని విమర్శలు చేశారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత్‌ పలుమార్లు ఐరోపా దృష్టికి  తీసుకెళ్లింది. అయినా సరే 2004లో పాక్‌ను ప్రధాన నాటోయేతర


దేశంగా అమెరికా గుర్తించింది. దీనిద్వారా కీలకమైన వ్యూహాత్మక భాగస్వాములకు సైనిక, ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఉగ్రవాదంపై తాను చేపట్టిన పోరాటంలో భాగంగా ఈ గుర్తింపు ఇచ్చినట్లు తన చర్యను అమెరికా


సమర్థించుకుంది. ఆ నిర్ణయంపై భారత్‌ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామాలను ఉద్దేశించే జైశంకర్ తీవ్రంగా స్పందించారు. ఇంతకుముందు నెదర్లాండ్స్‌కు చెందిన మీడియాకు మంత్రి వరుస ఇంటర్వ్యూలు


ఇచ్చారు. తన గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్థాన్‌కు తెలియదనే భావనను మంత్రి తీవ్రంగా ఖండించారు. పాక్‌, ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయన్నారు.


పాక్‌ నేతలు, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్‌ మునీర్‌ మత ఛాందసవాదంపై జైశంకర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.