Donald trump: ఖతార్‌ విమానం బహుమతిపై ప్రశ్న.. విలేకరిపై విరుచుకుపడిన ట్రంప్‌

Donald trump: ఖతార్‌ విమానం బహుమతిపై ప్రశ్న.. విలేకరిపై విరుచుకుపడిన ట్రంప్‌

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు ఖతార్‌ పాలకులు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్


విరుచుకుపడ్డారు. విలేకరిగా విధులు నిర్వహించడానికి నువ్వు సరైన వ్యక్తివి కాదంటూ ట్రంప్‌ అతడిపై చిందులు తొక్కారు.  దక్షిణాఫ్రికా (South Africa) అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ట్రంప్‌ భేటీ


నేపథ్యంలో వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.  ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌?. ఇక్కడి నుంచి వెళ్లిపో. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్‌ విమానానికి సంబంధం


ఏంటి? వాళ్లు విమానం ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. అయితే, దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు


తెలివితక్కువ వాడివి. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని


వ్యాఖ్యానించారు. * అమెరికాకు శత్రుదుర్భేద్య కవచం! ఇటీవల ట్రంప్‌ మధ్యప్రాచ్యంలో పర్యటించిన సంగతి తెలిసిందే. దీనికి ముందే విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇస్తామని


ఖతార్‌ (Qatar) పాలక కుటుంబం ప్రకటించింది. దీన్ని ట్రంప్ స్వీకరించారు. దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీకాలం


ముగిసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. తాజాగా ఈ విమానం ట్రంప్‌ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది.


అధ్యక్షుడి సురక్షిత వినియోగానికి అనుగుణంగా విమానంలో తగిన భద్రతాపరమైన మార్పుల కోసం తమ శాఖ కసరత్తు చేస్తోందని పెంటగాన్‌ ప్రతినిధి సీన్‌పార్నెట్‌ పేర్కొన్నారు.  వారిపై మారణహోమం ఈ భేటీ నేపథ్యంలో


రామఫోసా, ట్రంప్‌ల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులపై జరుగుతున్న మారణహోమం గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్రంప్‌ ప్లే చేయించారు.


అందులో దక్షిణాఫ్రికా నాయకుడు జూలియస్‌ మాలేమా మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 4.5 మిలియన్‌ మంది శ్వేత జాతీయులను అంతం చేయాలన్నారు. ఈక్రమంలోనే ద.ఆఫ్రికాలో శ్వేతజాతి రైతులపై రామఫోసా మారణహోమానికి


పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. దీనిపై రామఫోసా స్పందిస్తూ..‘వారు ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నారో మీరు చూశారు. ఇది ప్రభుత్వ విధానం కాదు. మా ప్రభుత్వ విధానం ఆయన చెప్పేదానికి పూర్తి వ్యతిరేకం’


అని పేర్కొన్నారు. ఈ వీడియోను తాను చూడలేదని, దీనిపై చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో తెల్లజాతీయుల భూములు లాక్కోవడం పైనా వీరు చర్చించుకున్నారు.