Play all audios:
థియేటర్ల బంద్ నిర్ణయం వెనుకున్నదెవరో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని.. ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. ఇంటర్నెట్ డెస్క్: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు
నిర్ణయం తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. ఈ
వివరాలు తెలియజేస్తూ జనసేన పార్టీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ‘‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దుర్గేశ్
స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూపులా ఏర్పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై విచారణ చేయాలని సూచించారు.
సినిమా హాళ్ల మూసివేత కారణంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి? ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు’’ అని జనసేన పోస్టులో పేర్కొంది. * ‘ రివ్యూ:
ఏస్.. విజయ్ సేతుపతి మూవీ ఎలా ఉందంటే? జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్టు కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అద్దె
ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శిస్తుండడంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోనే వసూళ్లలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి.
మల్టీప్లెక్స్ల్లో పర్సెంటేజీల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా, తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించాలని పలువురు యజమానులు తమ వాదనను వినిపించారు. దీనిపై ఇప్పటికే
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్తంగా సమావేశం నిర్వహించిన నిర్మాతలు.. శనివారం మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం థియేటర్ల బంద్పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.