Uttar pradesh: యూపీలో ఎన్‌కౌంటర్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ మృతి

Uttar pradesh: యూపీలో ఎన్‌కౌంటర్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ మృతి

Play all audios:

Loading...

యూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌ షూటర్‌ నవీన్‌కుమార్‌ మృతి చెందాడు.  ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఎన్‌కౌంటర్‌


చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Lawrence Bishnoi)కు చెందిన ఓ కీలక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో షార్ప్‌ షూటర్‌గా పేరొందిన


నవీన్‌కుమార్‌ 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.  హాపుర్‌లో ఉత్తరప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్, దిల్లీ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్‌ నిర్వహించారు. ఈక్రమంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు


చెందిన నవీన్‌కుమార్‌ అక్కడికి వచ్చాడు. పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే


ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమార్‌ ఘజియాబాద్‌ జిల్లా ‘లోని’ ప్రాంతానికి చెందినవాడు. లారెన్స్‌ గ్యాంగ్‌లో షార్ప్‌ షూటర్‌గా పేరొందాడు. ఆ గ్యాంగ్‌


సభ్యుల్లో ఒకడైన హషీం బాబాతో కలిసి పనిచేస్తున్నాడు. దిల్లీ, యూపీలలో హత్యా, హత్యాయత్నం, కిడ్నాప్‌, దోపిడీలతో సహా మొత్తం 20 కేసుల్లో కుమార్‌ నిందితుడు.  * ఇరాన్‌లో ముగ్గురు పంజాబ్‌ యువకుల


అపహరణ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (Baba


Siddique)ని    ఈ గ్యాంగ్‌ దారుణంగా హత్య చేసింది. దీంతో ఈ గ్యాంగ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. దీని నాయకుడైన లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బ్యారక్‌ల్లోకి అక్రమంగా


వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.