Play all audios:
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగంలో ప్రముఖ గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. దిల్లీ: వేగంగా అభివృద్ధి
చెందుతున్న భారత విమానయాన రంగంలో ప్రముఖ గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. 42 ఏళ్ల తర్వాత దేశంలో జరుగుతున్న గ్లోబల్
ఎయిర్లైన్స్ గ్రూప్ ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2030 నాటికి నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) సెగ్మెంట్ పరిమాణాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడమే
లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వాయు రవాణా పరిశ్రమలో భారత విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ రంగంలో భారీ పెట్టుబడులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. * ‘మా అమ్మ
ఎక్కడుంది?’.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్ ‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ పౌర విమానయాన మార్కెట్ భారత్దే. భారత్ను ప్రపంచం కేవలం విమానయాన మార్కెట్గా మాత్రమే కాకుండా వాల్యూ చైన్
లీడర్గా చూడాలని కోరుకుంటున్నాం. మా దిశ సరైంది. మా వేగం సరైంది.. అందువల్ల మేం శరవేగంగా ముందుకు దూసుకెళ్లడాన్ని కొనసాగిస్తాం’’ అన్నారు. ప్రపంచ స్థాయ విమానాశ్రయాల్లో భారత్ పెట్టుబడులు
పెడుతోందన్న ప్రధాని.. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 162కి పెరిగిందన్నారు. ఉడాన్ పథకం విజయవంతం కావడం భారత పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయమని చెప్పారు.