Play all audios:
దేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు గంటపాటు శ్రమించి వాటిని
బయటకు తీశారు. దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు
గంటపాటు శ్రమించి వాటిని బయటకు తీశారు. దాదాపు 6 గంటలపాటు కష్టపడి మొత్తం 8,125 రాళ్లు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. తీవ్రమైన
కడుపునొప్పి, జ్వరంతో ఇటీవల ఆ వృద్ధుడిని కుటుంబ సభ్యులు పోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు మే 12న ల్యాప్రోస్కోపిక్ విధానంలో
పిత్తాశయం తొలగింపు శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇంత పెద్ద మొత్తంలో రాళ్లు ఏర్పడిన కేసు.. దిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో ఇదే మొట్టమొదటిదై ఉండొచ్చని యాజమాన్యం
అభిప్రాయపడింది. ‘‘శరీరంలో కొవ్వుల సమతాస్థితి లోపించడం వల్ల గాల్స్టోన్స్ (పిత్తాశయ రాళ్లు) ఏర్పడుతుంటాయి. ఇది అరుదైన కేసు. సమస్యను గుర్తించిన తర్వాత కూడా చాలా ఏళ్లపాటు పట్టించుకోకుండా
ఉంటేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.’’అని డా. అమిత్ జావేద్ మీడియాకు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత రెండు రోజుల పాటు పరిశీలన
అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.