Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. చీఫ్‌ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు..

Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. చీఫ్‌ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు..

Play all audios:

Loading...

Odisha Engineer: ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.  భువనేశ్వర్‌: ఒక ప్రభుత్వ ఇంజినీర్‌ ఇంట్లో ఆదాయానికి మించిన


ఆస్తులు బయటపడ్డాయి. విజిలెన్స్ అధికారులు రావడంతో కంగుతిన్న అధికారి ఏం చేయాలో పాలుపోక నోట్లను కిటికీ నుంచి బయటకు విసిరాడు. ఆ కరెన్సీ వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ


ఘటన చోటుచేసుకుంది (Odisha Engineer). ఒడిశా రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు


వచ్చాయి. దాంతో విజిలెన్స్ అధికారులు ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తన బాగోతం బయటపడకూడదనుకున్న సారంగి ఆ డబ్బు అధికారుల కంట పడకూడదని తన ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల కట్టలను బయటకు విసిరాడు.


ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో కిటికీ నుంచి విసిరిన నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో భాగంగా రూ.రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన మొత్తం ఏడు


ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో..  26 మంది అధికారులు పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతోన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.