Am ratnam: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నిర్మాత ఎ. ఎం రత్నం

Am ratnam: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నిర్మాత ఎ. ఎం రత్నం

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ని సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం కలిశారు. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో


చర్చించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది. 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ గురించి ఆయన సీఎంతో చర్చించారని పేర్కొంది. అలాగే తెలంగాణలో ఈ


సినిమా టికెట్‌ ధరల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిపింది. తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఎ.ఎం రత్నం కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)


కథానాయకుడిగా రాబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్‌ కథానాయిక. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్‌


12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.