Play all audios:
ఇంటర్నెట్డెస్క్: భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయించిన
సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పోటిఫై (Spotify) పాకిస్థానీ పాటలను తొలగించింది. మే 8న కేంద్రం దేశంలోని అన్ని ఓటీటీ వేదికలకు ఈ సూచనలిచ్చింది. పాకిస్థాన్
మూలాలు ఉన్న వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు ఇతర మీడియా కంటెంట్లను నిలిపివేయాలని సూచించింది. ఈ సూచనలను అనుసరిస్తూ స్పోటిఫై పాక్ నటీనటుల పాటలను బుధవారం రాత్రి పూర్తిగా
తొలగించింది. దీంతో ప్రముఖ మాండ్, జోల్.. వంటి ఫేమస్ ట్రాక్లు ప్లాట్ఫామ్ నుంచి అదృశ్యమయ్యాయి. మరోవైపు పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను
కూడా భారత్లో బ్యాన్ చేశారు. ఆయనతో పాటు పలువురు పాక్ నటీనటులను బ్యాన్ చేశారు. * ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు.. కానీ: అజయ్ దేవ్గణ్ పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం
నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్ కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం
తీసుకుంది. ‘‘జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్థాన్ వెబ్సిరీస్లు, సినిమాలు, పాటలు,
పాడ్కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్లో అందుబాటులో ఉండదు’’ అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలియజేసింది.