Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas)ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టెల్ అవీవ్ గాజాపై భీకర దాడులను కొనసాగిస్తోంది. శనివారం అర్థరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు
నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్యూనిస్లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26మంది మరణించారని రోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 103 మంది
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడినట్లు అధికారులు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు
తెలిపారు. తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మందికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 18న
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి 3 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాతకు గురయ్యారని వెల్లడించింది. * గాజాపై ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని
బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు తెలిపారు. ‘మా బందీలను విడుదల
చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈనేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం
లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోంది’ అని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.