Nara lokesh: యువగళం విశేషాలతో ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు

Nara lokesh: యువగళం విశేషాలతో ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు

Play all audios:

Loading...

వైకాపా అరాచక పాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ పుస్తకావిష్కరణ మహానాడు వేదికపై జరిగింది. కడప: వైకాపా అరాచక పాలనపై గళమెత్తుతూ తాను


చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ పుస్తకావిష్కరణ మహానాడు వేదికపై జరిగింది. తొలి ప్రతిని యువనేత నారా లోకేశ్‌ సీఎం చంద్రబాబుకు అందజేశారు. 2023 జనవరి 27న


కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభించి 226 రోజులపాటు లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాలను మలుపుతిప్పింది. పాదయాత్ర రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ


నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కి.మీ మేర జైత్రయాత్రలా సాగింది. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, యాత్రను అడ్డగించేందుకు నాటి వైకాపా


ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అడ్డంకులు, ఆనాటి అరాచకపాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటిగాథలను ఈ పుస్తకంలో సచిత్రంగా కళ్లకు కట్టినట్లుగా చూపారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన


చంద్రబాబు.. యువనేత లోకేశ్‌ను అభినందించారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తకరూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు.