Play all audios:
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది. దిల్లీపై గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) గొప్పగా పుంజుకుని ప్లే ఆఫ్స్కు చేరింది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన ఆ జట్టు.. తాజాగా దిల్లీ క్యాపిటల్స్పై గెలిచి పాయింట్ల
పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న ముంబయి మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇతర సమీకరణాలు కలిసొస్తే టాప్-2లో కూడా నిలుస్తుంది. ఈ మ్యాచ్ను ముంబయి జట్టు యజమాని
నీతా అంబానీ (Nita Ambani) వాంఖడే స్టేడియానికి వచ్చి వీక్షించారు. దిల్లీపై గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కావడంతో నీతా అంబానీ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్ ఆరో టైటిల్
సాధించబోతోంది అనే అర్థం వచ్చేలా ఓ సిగ్నల్ ఇచ్చారు. ఆరు చేతి వేళ్లను చూపిస్తూ ఆరో కప్ కొట్టడానికి సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. * ముంబయి ఇండియన్స్ టాప్-2లోకి దూసుకుపోవాలంటే..! ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన తొలి జట్టు ముంబయి ఇండియన్సే. ఇప్పటివరకు ఆ జట్టు ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020)
ఛాంపియన్గా నిలిచింది. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి ముంబయి రికార్డును సమం చేసింది. ఈ ఏడాది ముంబయి మరోసారి ఛాంపియన్గా నిలిస్తే 6 టైటిళ్లు సాధించిన మొదటి జట్టుగా చరిత్ర
సృష్టించనుంది. ఈ సీజన్లో హార్దిక్ సేన తమ చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. మే 26న జైపుర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.