Ipl: మిచెల్‌ మార్ష్‌ శతకం.. Gt లక్ష్యం 236

Ipl: మిచెల్‌ మార్ష్‌ శతకం.. Gt లక్ష్యం 236

Play all audios:

Loading...

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్‌


(117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. నికోలస్ పూరన్ (56*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. మార్‌క్రమ్ (36) పరుగులు చేశాడు.


మార్‌క్రమ్, మార్ష్ తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించగా.. మార్ష్‌, పూరన్‌ రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుజరాత్‌ బౌలర్లలో అర్షద్‌, సాయికిశోర్‌ చెరో వికెట్‌ తీశారు.