Play all audios:
ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) భారీ స్కోరు చేసింది. జైపుర్: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా రాజస్థాన్
రాయల్స్ (Rajasthan Royals)తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (70; 37 బంతుల్లో
5 ఫోర్లు, 5 సిక్స్లు), శశాంక్ సింగ్ (59*; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, క్వెనా మఫాక, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ ఒక్కో
వికెట్ పడగొట్టారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (9), ప్రభ్సిమ్రన్ సింగ్ (21; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. వీరిద్దర్నీ తుషార్ దేశ్పాండే ఔట్ చేశాడు. ఐపీఎల్లో
తొలి మ్యాచ్ ఆడుతున్న మిచెల్ ఒవెన్ (0) డకౌటయ్యాడు. దీంతో పంజాబ్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నేహల్ వధేరా, శ్రేయస్ అయ్యర్ (30; 25 బంతుల్లో 5 ఫోర్లు) జట్టును
ఆదుకున్నారు. ఈ జోడీ నాలుగో వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నిలకడగా ఆడుతున్న శ్రేయస్ని రియాన్ పరాగ్ ఔట్ చేశాడు. దూకుడుగా ఆడిన వధేరా 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి
చేసుకున్నాడు. వధేరా ఔటైన తర్వాత శశాంక్ జోరు పెంచాడు. ఫారూఖీ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (21*; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో దూకుడుగా ఆడాడు.
పంజాబ్ చివరి నాలుగు ఓవర్లలో 60 పరుగులు రాబట్టింది.