Play all audios:
వైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి శనివారం బయటకు వెళ్లిన ఖైదీలు తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్తో హోటళ్లలో గడిపిన ఘటన జైపుర్లో వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: జైల్లో ఉండాల్సిన ఖైదీలు
ఎంచక్కా నగరమంతా తిరిగి.. తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్తో హోటళ్లలో గడుపుతూ ఎంజాయ్ చేసిన ఘటన జైపుర్లో వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం జైపుర్ జైలు నుంచి శనివారం బయటకు వెళ్లిన
ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపుర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం రఫీక్ బక్రి, భన్వర్
లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే నలుగురు ఖైదీలను కానిస్టేబుళ్లు వైద్యపరీక్షల కోసం బయటకు తీసుకువెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు గార్డులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు లంచం ఇస్తామని.. తమను
సాయంత్రం వరకు బయట వదిలేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన కానిస్టేబుళ్లు వారిని వదిలివేశారు. బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో అధికారులు వారి కోసం గాలిస్తుండగా ఓ
హోటల్లో రఫీక్ తన భార్యతో, భన్వర్ తన మాజీ ప్రియురాలితో ఉన్నట్లు గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. రఫీక్ భార్య వద్ద మాదకద్రవ్యాలు ఉండడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు
ఖైదీలు అంకిత్, కరణ్ విమానాశ్రయానికి సమీపంలోని ఒక హోటల్లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణ్తో పాటు ఉన్న అతడి బంధువు వద్ద అనేక మంది ఖైదీల ఐడీ కార్డులు, రూ. 45వేల నగదు
స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. * తిరగబడిన స్పీడ్బోటు.. గంగూలీ సోదరుడి కుటుంబానికి త్రుటిలో తప్పిన ప్రమాదం జైల్లో ఉన్న ఓ దోపిడీ దొంగ వీరు బయటకు పారిపోవడానికి ప్లాన్ చేసినట్లు
దర్యాప్తులో తేలిందన్నారు. అంతే కాకుండా జైల్లో కానిస్టేబుళ్లకు లంచాలు ఇస్తూ.. ఖైదీలు దొంగతనంగా ఫోన్లు వాడుతున్నారని.. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సహా పలువురు వీఐపీలకు ఇక్కడి నుంచి కాల్స్
చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఖైదీలు, వారి బంధువులు సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేసినట్లు సోమవారం మీడియాకు వెల్లడించారు.