Stock market: మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన సూచీలు

Stock market: మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన సూచీలు

Play all audios:

Loading...

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి నష్టాలు చవిచూసిన సూచీలు.. నేడు ఓ మోస్తరు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఓ దశలో 800


పాయింట్ల మేర లాభపడింది. రియల్టీ, ఫార్మా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఆటో, బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా రాణించడం సూచీలకు కలిసొచ్చింది. అయితే, విదేశీ మదుపర్ల అమ్మకాలపై ఆందోళన


కొనసాగుతోంది. మార్కెట్లు మరింత పైకి వెళ్లేందుకు ఇవి అడ్డంకిగా మారొచ్చన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.  సెన్సెక్స్‌ ఉదయం 81,327.61 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,186.44) లాభాల్లో


ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,021.64 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 410 పాయింట్ల లాభంతో 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129.55 పాయింట్ల లాభంతో 24,813.45 వద్ద ముగిసింది. డాలరుతో


రూపాయి మారకం విలువ 85.64గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌,


కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 66.17 డాలర్ల వద్ద కొనసాగుతుండగా..


బంగారం ఔన్సు 3,314 డాలర్ల వద్ద స్థిరపడింది.