Ktr: కాళేశ్వరంపై విచారణ పూర్తయ్యాక.. నోటీసులు ఇవ్వడమేంటి? : కేటీఆర్‌

Ktr: కాళేశ్వరంపై విచారణ పూర్తయ్యాక.. నోటీసులు ఇవ్వడమేంటి? : కేటీఆర్‌

Play all audios:

Loading...

కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.  హైదరాబాద్‌: కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు,


ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్‌ వాళ్లే కారణం కావొచ్చని ఆరోపించారు. వాళ్లే మేడిగడ్డకు


బాంబులు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ విచారణ పూర్తయిందని అని చెప్పి.. ఇప్పుడు నోటీసులు


ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడిలా ఉన్నారు. అప్పు పుట్టలేదని రెమో అంటారు.. రూ.లక్షా 60వేల కోట్లు రాము అప్పు చేశారు. ఉన్న డిక్లరేషన్లకే దిక్కు లేదు.. ఇప్పుడు నల్లమల


డిక్లరేషన్‌ ఎందుకు?నెల రోజులుగా సీఎం మదిలో ఉన్నవి వరల్డ్‌ బ్యూటీస్‌, కేసీఆర్‌కు నోటీసులు. మేము కట్టిన వాటి ముందు వరల్డ్‌ బ్యూటీస్‌ ఫొటోలు దిగుతున్నారు’’అని కేటీఆర్‌ అన్నారు.