Play all audios:
ఖీర్ భవానీ మేళా, అమర్నాథ్ యాత్రలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఖీర్ భవానీ మేళా,
అమర్నాథ్ యాత్రలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) పేర్కొన్నారు. పహల్గాం ఘటన అనంతరం రాష్ట్రంలో పర్యాటక రంగం దెబ్బతిందని, ఈ మేరకు
జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగాన్ని యథాస్థితికి తీసుకొచ్చి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి ఒమర్
అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘రానున్న ఖీర్ భవానీ మేళా, అమర్నాథ్ యాత్రలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటక రంగం కాస్త దెబ్బతింది.
ఈ క్రమంలో తొలుత మాతా ఖీర్ భవానీ మేళా విజయవంతం కావాలనే ప్రయత్నిస్తున్నాం. కాగా.. సోనామార్గ్, పహల్గాం మార్గాల ద్వారా అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. యాత్రికులు సురక్షితంగా తిరిగి వెళ్లాలని
కోరుకుంటున్నాం’’ అని సీఎం ఒమర్ తెలిపారు. * ‘బలోచిస్థాన్’పై సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే? రాష్ట్రంలో పర్యాటక రంగం యాథాస్థితికి వచ్చేందుకు ప్రభుత్వం ఎదురు చూస్తోందని
మఖ్యమంత్రి ఒమర్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని.. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి అధికారులు, ఇతర భాగస్వాములతో చర్చిస్తామని ఆయన
తెలిపారు. పహల్గాం ఘటన అనంతరం జమ్మూకశ్మీర్లో టూరిజాన్ని పునురుద్ధరించాలని వివిధ ప్రాంతాల పర్యాటకులు కూడా కోరుకోవడం శుభపరిణామమని ఒమర్ అబ్దుల్లా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని బృందాల
పర్యాటకులు వస్తున్నారు.. కావున యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో
రాష్ట్రంలో వాయిదా పడిన పలు అభివృద్ధి పనులకు సీఎం ఒమర్ అబ్దుల్లా శంకుస్థాపనలు చేశారు. తాగునీటి సరఫరా పథకం, ఓ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజల అవసరాల కోసం మంచి నీటి సరఫరా పథకాన్ని
ప్రారంభించాం. దీంతో సుమారు 4వేల మందికి తాగునీరు అందనుంది. పౌరులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో మా ప్రభుత్వం నిబద్ధతో పని చేస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు.